AP Government schools to get CBSE boost <br />#Ysjagan <br />#Andhrapradesh <br />#Cbse <br />#CBSESyllabus <br /> <br />ఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు మాధ్యమాన్నే కాదు సిలబస్ (పాఠ్య ప్రణాళిక)ను సైతం మార్చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈసీ సిలబస్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడున్న రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈ సిలబస్కు వచ్చే విద్యాసంవత్సరం నుంచే మారక తప్పని పరిస్ధితి.